పహల్గాం ఘటనలో నిందితులు మృతి: ఎమ్మెల్యే డ్రామా -

పహల్గాం ఘటనలో నిందితులు మృతి: ఎమ్మెల్యే డ్రామా

“ఆపరేషన్ సిందూర్” కు ఎలాంటి ప్రయోజనం లేదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్ సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు: భారత్ పాకిస్తాన్ పై చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్ మీడియాతో మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ భారత్‌కు ఎలాంటి ప్రయోజనం కూడా అందించలేదు. ఈ ఆపరేషన్‌లో మా దేశం ఏమీ చేయలేదు. కేవలం గొప్పగా చూపించుకోవడానికే ఇదంతా చెబుతున్నారు” అని అన్నారు.

ఆయన మరింత ప్రశ్నించారు, “భారత దాడుల్లో మరణించిన వారు ఎవరు? పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఒక్కరైనా ఉన్నారా? అధికారులు ఒకటి చెబితే, టీవీలు మరొకటి చెబుతున్నాయి. మరొకరు ఇంకేదో అంటున్నారు. మనం ఎవరిని నమ్ముతాము? అధికారిక ప్రకటన ఎక్కడ?”

ఆయన ఇంకా ఆరోపించారు, “భారత్ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారు? మన సరిహద్దును దాటిన ఆ ఉగ్రవాదులు ఎవరు? వారి గుర్తింపు ఏంటి? సరిహద్దులో ఎందుకు భద్రత లేదు? వారు ఎలా తప్పించుకున్నారు? ఉగ్రవాద మూలాలు, శాఖలను గుర్తించి వాటిని నిర్మూలించాలి. పహల్గాం ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమే. పహల్గాం బాధితులకు కేంద్రం పరిహారం ఇచ్చిందా?”

ఇదిలా ఉండగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపిన మేరకు “ఆపరేషన్ సిందూర్”లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. పాక్ దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *